వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఈటల
ABN , First Publish Date - 2021-04-16T19:20:03+05:30 IST
మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్లో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
కరీంనగర్ జిల్లా: మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్లో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్సిజన్, కరోనా టీకా కొరత లేకుండా చూస్తామన్నారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ కొరత ఉందని, కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ని రాష్ట్రానికి వ్యాక్సిన్ను ఎక్కువగా సరఫరా చేయాలని కోరామన్నారు. 25 ఏళ్లపై వారికి వ్యాక్సిన్ అందజేయాలని కేంద్రమంత్రిని కోరామన్నారు. రెమిడేసివిర్ ఇంజెక్షన్స్ బ్లాక్లో కొనవద్దని సూచించారు. ఎమర్జెన్సీలోనే వాడాలని, సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోందన్నారు. అయినా లాక్ డౌన్లు, కర్ఫ్యూ, 144 సెక్షన్స్ ఉండవని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.