Minister Durai Murugan: ఎడప్పాడి అవినీతి సుప్రీంకోర్టుకెళ్లింది
ABN , First Publish Date - 2022-08-12T15:56:02+05:30 IST
ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) అవినీతి సుప్రీంకోర్టు వరకు వెళ్లిందని, తమ ప్రభుత్వం రూ.20 వేల అవినీతికి పాల్పడిందని ఆయన
- మంత్రి దురైమురుగన్
వేలూరు(చెన్నై), ఆగస్టు 11: ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) అవినీతి సుప్రీంకోర్టు వరకు వెళ్లిందని, తమ ప్రభుత్వం రూ.20 వేల అవినీతికి పాల్పడిందని ఆయన ఫిర్యాదు చేస్తే ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నీటిపారుదల శాఖ మంత్రి దురై మురుగన్(Minister Durai Murugan) తెలిపారు. వేలూరులో గురువారం మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ, ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికమవుతున్న మాదకద్రవ్యాలను నిరోధించేలా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతుందన్నారు. మాదకద్రవ్యాలకు విద్యార్థులు బానిసలు కాకుండా ఉండేలా అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.