chandrababu ఆ విషయంతోనే పక్కకు తప్పుకున్నాడు: మంత్రి ధర్మాన

ABN , First Publish Date - 2022-05-29T01:49:49+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని దోపిడి చేసి... ఈ దోపిడిని తాను ఆపలేననే పక్కకు తప్పుకున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు.

chandrababu ఆ విషయంతోనే పక్కకు తప్పుకున్నాడు: మంత్రి ధర్మాన

పల్నాడు జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని దోపిడి  చేసి... ఈ దోపిడిని తాను ఆపలేననే పక్కకు తప్పుకున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. శనివారం  నరసరావుపేటలో సామాజిక బేరి సభ నిర్వహించారు. ఈసభకు వైసీపీ మంత్రులు , ఎమ్మెల్యే, నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ..  ప్రభుత్వ పరిపాలనను మూడేళ్ల తర్వాత అంచనా వేయవచ్చునని అన్నారు.సామాజిక న్యాయం చేయాలనే ఫిలాసఫీతోనే జగన్ పదిహేడు మంది ఎస్సీ, ఎస్టీ,బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారని చెప్పారు.చదువు విషయంలో మనకన్నా ఇరవై ఒక్క రాష్ట్రాలు ముందున్నాయని తెలిసి, ఈ విషయాన్ని  సీఎం జగన్ గుర్తించి ‘నాడు- నేడు’, ‘అమ్మ ఒడి’ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు.శ్రమజీవులకే జగన్ డబ్బులు పంచిపెడుతున్నారన్నారు.డబ్బులు పంచి పెట్టడంలో ఎక్కడా అవినీతి జరగడం లేదన్నారు.కరోనా సమయంలో ఒక్క కుటుంబమైనా పస్తులున్నామని చెప్పిందా అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అడిగారు.

Updated Date - 2022-05-29T01:49:49+05:30 IST