నేను క్షేమంగానే ఉన్నా: ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2021-08-06T23:39:01+05:30 IST
మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ప్రమాదం నుంచా తాను బయటిపడి క్షేమంగానే ఉన్నానని
హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ప్రమాదం నుంచా తాను బయటిపడి క్షేమంగానే ఉన్నానని ఏబీఎన్తో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు. ఎవరూ ఆందోళన చెందవద్దని ఏబీఎన్తో మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
మహబూబాబాద్: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రి ఎర్రబెల్లి క్వానాయ్లోని వాహనానికి ట్రాక్టర్ కేజీ వీల్స్ తగిలాయి. మంత్రి ఎర్రబెల్లి వాహనం వెళ్లిన తరువాత సెక్యూరిటీ వాహనాన్ని ట్రాక్టరు ఢీ కొట్టింది. దీంతో మంత్రి ఎర్రబెల్లి వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం నుంచి మంత్రి ఎర్రబెల్లి క్షేమంగా బయటపడ్డారు. వెలిశాల-కొడకండ్ల మధ్య ఈ ఘటన జరిగింది. మంత్రికి ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.