డీఎంకే ఇచ్చిన ‘టీవీ’ ఉందా?..అయితే రూ. లక్ష బహుమానం! : మంత్రి జయకుమార్‌

ABN , First Publish Date - 2021-02-25T13:48:12+05:30 IST

డీఎంకే ప్రభుత్వ హయాంలో అందజేసిన ‘టీవీ’ ప్రస్తుతం చక్కగా పనిచేస్తుంటే లక్ష రూపాయలను బహుమానంగా అంది స్తామని మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్‌ తెలిపారు. నగరంలో మంత్రి మీడియాతో ...

డీఎంకే ఇచ్చిన ‘టీవీ’ ఉందా?..అయితే రూ. లక్ష బహుమానం! : మంత్రి జయకుమార్‌

చెన్నై/పెరంబూర్ (ఆంధ్రజ్యోతి): డీఎంకే ప్రభుత్వ హయాంలో అందజేసిన ‘టీవీ’ ప్రస్తుతం చక్కగా పనిచేస్తుంటే లక్ష రూపాయలను బహుమానంగా అంది స్తామని మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్‌ తెలిపారు. నగరంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, తాళికి బంగారం పథకం కింద 2011 నుంచి రూ.6 వేల కోట్ల ను ఖర్చుచేశామని, ఈ పథకం ద్వారా 12 లక్షల కుటుం బాలు లబ్ధ్దిపొందాయన్నారు. అన్నాడీఎంకే హయాంలో జరిగిన రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోని ప్రతిపక్ష నేత స్టాలిన్‌ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. గతంలో అధికారంలో ఉన్న డీఎంకే రాష్ట్ర అప్పులను రూ.1 లక్ష కోట్లు చేసి వెళ్లిందని, డీఎంకే అందజేసిన టీవీల కోసమే అప్పులు చేశారని మంత్రి విమర్శించారు. రాష్ట్రంలో విడతల వారీగా మధ్యనిషేధం అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన అన్నారు.

Updated Date - 2021-02-25T13:48:12+05:30 IST