అభివృద్ధి కోసమే 3 రాజధానులు: మంత్రి వేణు

ABN , First Publish Date - 2020-08-08T00:59:49+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబుపై బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఒక రాజ్యానికి రాజులా ప్రవర్తించారని

అభివృద్ధి కోసమే 3 రాజధానులు: మంత్రి వేణు

కాకినాడ: టీడీపీ అధినేత చంద్రబాబుపై బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఒక రాజ్యానికి రాజులా ప్రవర్తించారని ఆరోపించారు. ‘అమరావతి రైతుల నుంచి భూమి సేకరించి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. రైతులు నష్టపోయారంటే అది చంద్రబాబు వల్లే. ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోయేలా చేసిన వ్యక్తి చంద్రబాబు. అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకే మూడు రాజధానులు. చట్టంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని మూడు రాజధానుల బిల్లును అడ్డుకున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు అలవాటే. చంద్రబాబుకు అమరావతిలో జరిగిన అక్రమాలు ఎప్పటికైనా బయట పడతాయని తెలుసు. అందుకే అన్ని తాత్కాలిక భవనాలు కట్టారు. ఆయన మాత్రం శాశ్వతంగా హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్నారు. ఓటుకు నోటుకు కేసుకు భయపడే హైదరాబాద్‌ని వదిలి వచ్చేశారు. చంద్రబాబు ఆయన ఎమ్మెల్యేలను కాపాడుకునే స్థితిలో కూడా లేరు. ముందు చంద్రబాబు ఆయన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి.’ అని మంత్రి డిమాండ్ చేశారు.


Updated Date - 2020-08-08T00:59:49+05:30 IST