Sandals: మంత్రి కారుపై చెప్పు విసిరిన దుండగుడు
ABN , First Publish Date - 2022-08-14T13:00:24+05:30 IST
మదురైలో ఆర్ధిక శాఖ మంత్రి పళనివేల్ త్యాగరాజన్(Finance Minister Palanivel Thyagarajan) కారుపై చెప్పు విసిరేసిన కేసులో పోలీసులు ఐదుగురు బీజేపీ
- డీఎంకే నేతల రైల్రోకో
- ఐదుగురు బీజేపీ కార్యకర్తల అరెస్టు
పెరంబూర్(చెన్నై), ఆగస్టు 13: మదురైలో ఆర్ధిక శాఖ మంత్రి పళనివేల్ త్యాగరాజన్(Finance Minister Palanivel Thyagarajan) కారుపై చెప్పు విసిరేసిన కేసులో పోలీసులు ఐదుగురు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. జమ్ము-కశ్మీర్లో తీవ్రవాదుల దాడిలో మృతిచెందిన సైనికుడు లక్ష్మణన్ భౌతికకాయానికి అంజలి ఘటించేందుకు శనివారం ఉదయం మంత్రి త్యాగరాజన్, కలెక్టర్ అనీష్ శేఖర్, మేయర్ ఇంద్రాణి, అధికారులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(Annamalai) విమానాశ్రయానికి చేరుకున్నారు. కార్యక్రమం అనంతరం మంత్రి వెళ్తుండగా, ఆయన కారుపై గుర్తు తెలియని వ్యక్తులు చెప్పు విసిరేశారు. ఈ సమాచారం తెలుసుకున్న డీఎంకే శ్రేణులు రైల్వేస్టషన్లోకి చొరబడి రైల్రోకో(Railroco) చేపట్టారు. మంత్రిని అవమానించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను కించపరిచేలా మంత్రి వ్యాఖ్యానించారని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తరఫున మదురై నగర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, మంత్రి కారుపై చెప్పు విసిరేసిన వ్యవహారంపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ జరిపి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కుమార్, మీడియా విభాగం కార్యదర్శి బాల, గోపినాధ్, జయకృష్ణన్, మహమ్మద్ యాకూబ్ తదితరులను అరెస్ట్ చేశారు.