హంద్రీనీవా నుంచి నీరిస్తున్నాం: మంత్రి బుగ్గన

ABN , First Publish Date - 2022-01-04T23:12:21+05:30 IST

సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు 68 చెరువులకు

హంద్రీనీవా నుంచి నీరిస్తున్నాం: మంత్రి బుగ్గన

కర్నూలు: సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు చెరువులకు హంద్రీనీవా నుంచి నీరిస్తున్నామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కృష్ణగిరి మండలం లక్కసాగరం వద్ద హంద్రీనీవా నుంచి 68 చెరువులకు నీటి మల్లింపు   ట్రయల్ రన్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. జగన్ ఇచ్చిన హామీ మేరకు 68 చెరువులకు హంద్రీ నీవా నుంచి నీరిస్తున్నామన్నారు. హంద్రీనీవా నుంచి నీటిని చెరువులకు మళ్లించడంపై మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ హయాంలో 15 శాతం మాత్రమే పనులు చేస్తే, వైసీపీ అధికారంలోకి వచ్చాక 65 శాతం పనులను పూర్తి చేసామని బుగ్గన పేర్కొన్నారు. 


Updated Date - 2022-01-04T23:12:21+05:30 IST