ఏపీ సచివాలయానికి చేరుకున్న మంత్రి బుగ్గన
ABN , First Publish Date - 2022-03-11T13:58:02+05:30 IST
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కాసేపటి క్రితమే సచివాలయానికి చేరుకున్నారు.
అమరావతి: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కాసేపటి క్రితమే సచివాలయానికి చేరుకున్నారు. టీటీడీ వేదపండితులతో బడ్జెట్ కాపీలకు మంత్రి బుగ్గన, ఆర్థిక శాఖ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 10:15 గంటలకు2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను సాధారణ బడ్జెట్ను అసెంబ్లీలో మంత్రి బుగ్గన ప్రవేశపెట్టనున్నారు.
కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ...
మరికాసేపట్లో సీఎం జగన్ నేతృత్వంలో ఏపీ కేబినెట్ భేటీ అయి సాధారణ బడ్జెట్కు ఆమోదముద్ర వేయనుంది. ఆ వెంటనే అసెంబ్లీలో బుగ్గన బడ్జెట్ను ప్రవేశపెడతారు. తరువాత వ్యవసాయ అనుబంధ రంగాలపై బడ్జెట్ను మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టనున్నారు. మండలిలో సాధారణ బడ్జెట్ను డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ప్రవేశపెట్టనున్నారు. తరువాత వ్యవసాయ అనుబంధ రంగాలపై బడ్జెట్ను మంత్రి సిదిరి అప్పుల రాజు ప్రవేశపెడతారు.