Buggana Rajendranath Reddy: మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ చేసిన అప్పులు తక్కువే: మంత్రి బుగ్గన
ABN , First Publish Date - 2022-07-26T20:48:51+05:30 IST
పరిమితికి మించి ఏపీ(AP) ఎక్కువ అప్పులు చేయలేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి(Buggana rajendranath reddy) స్పష్టం చేశారు.
అమరావతి: పరిమితికి మించి ఏపీ(AP) ఎక్కువ అప్పులు చేయలేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి(Buggana rajendranath reddy) స్పష్టం చేశారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ చేసిన అప్పులు తక్కువే అని అన్నారు. కేంద్రం బయటపెట్టిన ఏపీ అప్పుల చిట్టాపై మంత్రి స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... కోవిడ్ సంక్షోభం తర్వాత ప్రతీ రాష్ట్రం అప్పులు చేసిందని అన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రం కూడా అప్పులు చేసిందన్నారు. 2014-19 కాలంలో టీడీపీ (TDP) ఇష్టానుసారంగా వ్యవహరించిందని విమర్శించారు. ఏపీలో ద్రవ్యలోటు మూడు శాతానికి తగ్గించామన్నారు. తెలంగాణ ద్రవ్యలోటు 4 శాతం ఉంటే.. ఏపీలో 3 శాతమే అని తెలిపారు. నిబద్ధతతో పాలన సాగిస్తున్నామని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.