రాష్ట్రంలో విద్యుత్ కోతలు: మంత్రి బాలినేని

ABN , First Publish Date - 2022-02-17T21:20:52+05:30 IST

రాష్ట్రంలో విద్యుత్ కోతలున్నాయని మంత్రి

రాష్ట్రంలో విద్యుత్ కోతలు: మంత్రి బాలినేని

ప్రకాశం: రాష్ట్రంలో చిన్న,చిన్న విద్యుత్ కోతలున్నాయని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీలు దాన్ని పెద్దవి చేసి చూపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం వేల కోట్లు అప్పులు చేసి వెళ్లడంతో ఈ పరిస్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి రాష్ట్రాన్ని విభజించాయన్నారు. విభజన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీపై ఉందని ఆయన పేర్కొన్నారు. డీజీపీగా సవాంగ్ రెండున్నరేళ్లు పని చేశారని ఆయన తెలిపారు. సవాంగ్‌కు ఇప్పుడు కూడా మంచి పోస్ట్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2022-02-17T21:20:52+05:30 IST