బీజేపీకి ఎజెండా లేదు: మంత్రి బాలినేని

ABN , First Publish Date - 2021-12-29T20:27:51+05:30 IST

టీడీపీ ఎజెండానే బీజేపీ మళ్లీ మొదలు పెట్టిందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.

బీజేపీకి ఎజెండా లేదు: మంత్రి బాలినేని

ప్రకాశం: టీడీపీ ఎజెండానే బీజేపీ మళ్లీ మొదలు పెట్టిందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎజెండా లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతోందన్నారు. కోర్టుల్లో ఉన్న విషయాన్ని బీజేపీ నేతలు ఎలా డిసైడ్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు.రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో జగన్ సఖ్యతతో ఉన్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఒక్క టన్ను ఎర్రచందనం కూడా స్మగ్లింగ్ జరగలేదని చెప్పారు. విద్యుత్ బిల్లులు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-12-29T20:27:51+05:30 IST