పవన్పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి బాలినేని
ABN , First Publish Date - 2021-10-02T16:52:23+05:30 IST
జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఇటీవల అధికార పార్టీ నేతలు టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్తో ప్రారంభమైన గొడవ.. ఇప్పటికీ రావణకాష్టంలా రగులుతూనే ఉంది.
ప్రకాశం : జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఇటీవల అధికార పార్టీ నేతలు టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్తో ప్రారంభమైన గొడవ.. ఇప్పటికీ రావణకాష్టంలా రగులుతూనే ఉంది. మంత్రులు ప్రెస్మీట్లు పెట్టి మరీ పవన్పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్కు దమ్ము ఉంటే ఒంటరిగా పోటీ చేసి గెలవాలన్నారు. తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. 38 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకే ఒంటరిగా పోటి చేసే దమ్ము లేదన్నారు. ఎన్నికల్లో పొత్తు లేకుండా ఎప్పుడైనా టీడీపీ పోటీ చేసిందా? అని మంత్రి బాలినేని ప్రశ్నించారు.