త్వరలోనే విశాఖ నుంచి జగన్ పాలన: అవంతి

ABN , First Publish Date - 2021-01-21T19:00:13+05:30 IST

త్వరలోనే విశాఖ నుంచి జగన్ పరిపాలన చేస్తారని..ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినా ఆగదని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

త్వరలోనే విశాఖ నుంచి జగన్ పాలన: అవంతి

విశాఖపట్నం: త్వరలోనే విశాఖ నుంచి జగన్ పరిపాలన చేస్తారని..ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినా  ఆగదని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం నిత్యావసర సరుకుల వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి.. అనంతరం స్వయంగా వాహనాన్ని నడిపారు. ఆపై మంత్రి అవంతి మీడియాతో మాట్లాడుతూ ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల వాహనాలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో 828 వాహనాలు..లబ్ధి దారులకు సరుకులు అందిస్తాయని చెప్పారు. దేశంలో ఏ సీఎంకు లేని కీర్తి ప్రతిష్టలు జగన్‌కి వస్తున్నాయని... ప్రతిపక్షాలు సహించలేక పోతున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో 40 గుళ్లు తొలగించారన్నారు. ఇప్పుడు బాబుకి దేవుడు గుర్తుకు వచ్చారని విమర్శించారు. 


Updated Date - 2021-01-21T19:00:13+05:30 IST