బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్.. ఏమైనా సాధించారా?: అవంతి

ABN , First Publish Date - 2022-03-15T16:48:32+05:30 IST

అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు.

బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్.. ఏమైనా సాధించారా?: అవంతి

అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జనసేన ఆవిర్భావ సభలో పవన్ అసత్యాలు మాట్లాడారని విమర్శించారు. బీజేపీతో పొత్తు ఏపీలోనా.. తెలంగాణలో కూడానా? అని ప్రశ్నించారు. పవన్‌కు ఆవేశం ఎక్కువ.. ఆలోచన తక్కువన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని ఏమైనా సాధించారా? అని మంత్రి ప్రశ్నించారు. 


చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకే పవన్ కల్యాణ్ పార్టీ పెట్టారని మంత్రి అవంతి ఆరోపించారు. అవకాశం వస్తే చంద్రబాబు పవన్‌ను సీఎం చేస్తారా? లోకేష్‌ను చేస్తారా? అని ప్రశ్నించారు. తమపై వ్యక్తిగత విమర్శలకు దిగితే ఊరుకోమన్నారు. ‘‘నేను దేవుడిని నమ్మే వ్యక్తిని దయ చేసి నా జోలికి రావద్దు.. నాకు నేనే సినిమా హీరో నాకు ఎవ్వరి అండ అవసరం లేదు..’’ అని మంత్రి అవంతి వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-03-15T16:48:32+05:30 IST