జస్టిస్ చంద్రుపై చంద్రబాబు వాఖ్యలు బాధాకరం:మంత్రి అప్పలరాజు
ABN , First Publish Date - 2021-12-16T22:06:29+05:30 IST
జస్టిస్ చంద్రుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అనుచిత వాఖ్యలు చేయడం బాధాకరమని మంత్రి అప్పలరాజు అన్నారు.
శ్రీకాకుళం: జస్టిస్ చంద్రుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అనుచిత వాఖ్యలు చేయడం బాధాకరమని మంత్రి అప్పలరాజు అన్నారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. పేదల హక్కుల కోసం రిటైర్డ్ జడ్జ్ చంద్రు నిరంతరం పోరాడారని చెప్పారు. ప్రభుత్వం కోర్టులతో ఏవిధంగా పోరాడుతుందో ఆ వాస్తవాల గురించి రిటైర్డ్ జడ్జ్ చంద్రు మాట్లాడారని చెప్పారు. చంద్రబాబు ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నారన్నారు. ఎవరైనా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితే పేటిఎం బ్యాచ్తో తిట్టిస్తున్నారని మండిపడ్డారు..త్రీ క్యాపిటల్ అంశంపై ఉత్తరాంధ్రలో ఉద్యమం జరగాల్సి ఉందన్నారు. జేఏసీ ఏర్పాటు చేసి గ్రామ గ్రామాన ఉద్యమిస్తామని పిలుపునిచ్చారు. విశాఖ రాజధాని అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి అప్పలరాజు తెలిపారు.