chandrababu బీసీలను బెదిరించాడు: మంత్రి అప్పలరాజు
ABN , First Publish Date - 2022-05-29T02:02:59+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బీసీల తొక్క తీస్తామని బెదిరించారని మంత్రి అప్పలరాజు అన్నారు.
పల్నాడు జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బీసీల తొక్క తీస్తామని బెదిరించారని మంత్రి అప్పలరాజు అన్నారు. శనివారం నరసరావుపేటలో సామాజిక బేరి సభ నిర్వహించారు. ఈసభకు వైసీపీ మంత్రులు , ఎమ్మెల్యే, నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. రాజ్యాధికారం కోసం బీసీలకు అవకాశం చంద్రబాబు కల్పించారా అని ప్రశ్నించారు. ఏ నాయకుడు, ఏ రాష్ట్రం చేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సీఎం జగన్రెడ్డి పెద్ద పీట వేశారని చెప్పారు. ఇంతకుముందెన్నడూ ఏ ప్రభుత్వ హయంలోనూ అణగారిన వర్గాలకు ఇంత ప్రాధాన్యం లభించలేదని వైసీపీ ప్రభుత్వంలోనే అందరికి సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పారు. కనీసం నారా లోకేష్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేదని మంత్రి అప్పలరాజు ఎద్దేవా చేశారు.