చంద్రబాబుకు మంత్రి అనిల్ సవాల్

ABN , First Publish Date - 2020-08-03T22:20:36+05:30 IST

మూడు రాజధానుల వ్యవహారం విషయంలో అధికారపార్టీపై ప్రతిపక్షాలు

చంద్రబాబుకు మంత్రి అనిల్ సవాల్

అమరావతి : మూడు రాజధానుల వ్యవహారం విషయంలో అధికారపార్టీపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి సవాల్ విసిరారు. మూడు రాజధానులు వద్దంటున్న చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. చంద్రబాబుకు దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని కూడా అనిల్ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి కూడా మాట్లాడారు. పవన్‌కళ్యాణ్‌ ఎప్పుడు ఎవరితో ఉంటారో ఆయనకే తెలియదు? అని అనిల్ చెప్పుకొచ్చారు.


ఇల్లు ఎందుకు కట్టుకోలేదు!?

అమరావతిని మార్చడం లేదు. మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నాం. అమరావతికి ప్రాధాన్యం తగ్గదు. అన్ని ప్రాంతాల అభివృద్ధే మా ధ్యేయం. రాష్ట్ర విభజన సమయంలోనూ చంద్రబాబు ఇంత గగ్గోలు పెట్టలేదు. అమరావతిపై జగన్‌కు ప్రేమ ఉంది కాబట్టే సొంత ఇల్లు కట్టుకున్నారు. చంద్రబాబు ఐదేళ్లు సీఎంగా ఉండి అమరావతిలో ఇల్లు ఎందుకు కట్టుకోలేదు?. 8 నెలలుగా చంద్రబాబు రాష్ట్రానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారుఅని అనిల్ విమర్శలు గుప్పించారు.

Updated Date - 2020-08-03T22:20:36+05:30 IST