పులిచింతల ప్రాజెక్ట్ గేట్ ఊడిపోవడంపై ఎక్స్పర్ట్ కమిటీ: అనిల్
ABN , First Publish Date - 2021-08-05T23:29:36+05:30 IST
పులిచింతల ప్రాజెక్ట్ గేట్ ఊడిపోవడంపై ఎక్స్పర్ట్ కమిటీ: అనిల్
గుంటూరు: పులిచింతల ప్రాజెక్ట్ గేట్ ఊడిపోవడంపై ఎక్స్పర్ట్ కమిటీ వేశామని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. ఫ్లడ్ వాటర్ వస్తుండడంతో అధికారులను అప్రమత్తం చేశామన్నారు. 5 లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వదులుతున్నామని తెలిపారు. పోలవరం నుంచి ఎక్స్పర్ట్స్ వస్తున్నారని చెప్పారు. రేపటి లోపు గేట్ను బిగించే అవకాశం ఉందన్నారు.