మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు

ABN , First Publish Date - 2022-06-08T16:36:18+05:30 IST

మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా రాణిస్తున్నారని, స్త్రీ సంక్షేమం కోసం రాష్ట్రప్రభుత్వం పలు పథకాలు విజయవంతంగా అమలు చే

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు

                           - మంత్రి టీఎం అన్బరసన్‌


ప్యారీస్‌(చెన్నై), జూన్‌ 7: మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా రాణిస్తున్నారని, స్త్రీ సంక్షేమం కోసం రాష్ట్రప్రభుత్వం పలు పథకాలు విజయవంతంగా అమలు చేస్తోందని మంత్రి టీఎం అన్బరసన్‌ పేర్కొన్నారు. స్థానిక రాయపేటలోని సవేరా హోటల్‌లో మంగళవారం మధ్యాహ్నం శక్తి మసాలా స్వయం శక్తి అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రప్రభుత్వ చిన్న, మధ్యతరగతి పరిశ్రమల శాఖ మంత్రి అన్బరసన్‌ ముఖ్యఅతిథిగా హాజరుకాగా, విశిష్టఅతిథిగా సీనియర్‌ నటి రాధిక హాజరై పలు రంగాల్లో ఉత్తమ సేవలందిస్తున్న మహిళలకు స్వయంశక్తి అవార్డులు అందజేసి అభినందించారు. సవేరా హోటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నీనా రెడ్డి, లోటస్‌ గ్రూప్‌ ఎండీ జయశ్రీ ఉమ్మడి, రివర్‌ సేవా సంస్థ వ్యవస్థాపకురాలు డా.మధు చరణ్‌ సహా 24 మంది ఈ అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్రాండ్‌ అవతార్‌ సంస్థ సీఈఓ హేమచంద్రన్‌, తమిళనాడు ప్రభుత్వ నిర్వహణలోని టాన్సింగ్‌ నిర్వాహక అధికారి శివరాజా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-08T16:36:18+05:30 IST