Polavaram: పోలవరం ప్రాజెక్ట్ ఇప్పట్లో పూర్తి కాదు.. Ambati Rambabu సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-07-19T22:58:30+05:30 IST

పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)పై మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) సంచలన విషయాలు చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ ఇప్పట్లో పూర్తి కాదని...

Polavaram: పోలవరం ప్రాజెక్ట్ ఇప్పట్లో పూర్తి కాదు.. Ambati Rambabu సంచలన వ్యాఖ్యలు

అమరావతి (Amaravathi): పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)పై మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) సంచలన విషయాలు చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ ఇప్పట్లో పూర్తి కాదని ఆయన తేల్చి చెప్పారు. దశలవారీగా మాత్రమే పోలవరం పూర్తి చేయడం కుదురుతుందని తెలిపారు.  సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. త్వరలో పోలవరం ప్రాజెక్ట్‌పై శ్వేతపత్రం విడుదల చేస్తామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. దీంతో పోలవరం ప్రాజెక్టును ఇదిగో కడుతున్నామని.. అదిగో అయిపోతుందని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు అంబటి చెప్పిన నిజంతో తన వైఖరేంటో చాలా స్పష్టంగా అర్ధమవుతోంది. 


గత ప్రభుత్వంలో పోలవరం పనులు 75 శాతం అయిపోయాయని అప్పుడు టీడీపీ (Tdp) నేతలు చెప్పారు. కేవలం 25 శాతం పనులు కూడా వైసీపీ (Ycp) ప్రభుత్వం చేయలేకపోతోందని కొంతకాలంగా టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే నిజమవుతున్నాయి. ఇప్పట్లో పోలవరం పూర్తి కాదని ప్రభుత్వం చేతులెత్తేయడంతో మరోసారి వైసీపీ నిజ స్వరూపం బయటపడిందని టీడీపీ నేతలు అంటున్నారు. 




Updated Date - 2022-07-19T22:58:30+05:30 IST