షుగర్‌ ఫ్యాక్టరీ అమ్మకంలో మంత్రి అమర్‌ పాత్ర

ABN , First Publish Date - 2022-05-20T06:27:22+05:30 IST

తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీ అమ్మకంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు.

షుగర్‌ ఫ్యాక్టరీ అమ్మకంలో మంత్రి అమర్‌ పాత్ర
మాట్లాడుతున్న పీలా గోవింద

మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆరోపణ

కొత్తూరు, మే 19 : తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీ అమ్మకంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు. గురువారం మండలంలోని తగరంపూడి, సీతానగరం గ్రామాల్లో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని చెరకు రైతులపై కోపంతోనే నల్లబెల్లంపై ఆంక్షలు విధించారన్నారు. తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీపై మంత్రి అమర్‌నాథ్‌ వివరణ ఇవ్వకపోవడం ఆయన చేస్తున్న కుట్రకు నిదర్శనమన్నారు. అదే విధంగా ఉపాధి హామీ కూలీలకు ఒక్కపూటే పని కల్పించాలన్నారు. నల్లబెల్లంపై ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లారు. బకాయిలు చెల్లించకపోతే ఉపాధి కూలీలు ఏవిధంగా బతకాలని ఆయన ప్రశ్నించారు. తక్షణమే ఉపాధి కూలి బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొణతాల శ్రీనివాసరావు, నడిపల్లి గణేశ్‌, మువ్వల అప్పలనాయుడు, బండారు రామారావు, నక్కా చెల్లయ్య, అందిబోయిన అప్పలనాయుడు, రాపేటి రాము, ప్రకాశ్‌, చందక నరసింగ్‌, సూర్య, కన్నంనాయుడు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-20T06:27:22+05:30 IST