నిర్మల్ జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్: మంత్రి అల్లోల
ABN , First Publish Date - 2022-03-07T23:07:24+05:30 IST
నిర్మల్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసేందుకు సీయం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్: నిర్మల్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసేందుకు సీయం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో సీయం కేసీఆర్ ను మంత్రి మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ మేరకు నిర్మల్ జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు గురించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారని, నిర్మల్ జిల్లాలో కూడా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని హామినిచ్చారని మంత్రి తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ తుది ఆమోదం తెలిపిన తర్వాత కాలేజీ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి చెప్పారు.