కొండాలక్ష్మణ్‌ బాపూజీ సేవలు మరువలేనివి- ఇంద్రకరణ్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-09-21T19:44:17+05:30 IST

బడుగు వర్గాల అభ్యున్నతి కోసం, తెలంగాణ రాష్ట్రసాధన కోసం రాజీలేకుండా పోరాడిన మహనీయుడు కొండా లక్ష్మణ్‌బాపూజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు.

కొండాలక్ష్మణ్‌ బాపూజీ సేవలు మరువలేనివి- ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌: బడుగు వర్గాల అభ్యున్నతి కోసం, తెలంగాణ రాష్ట్రసాధన కోసం రాజీలేకుండా పోరాడిన మహనీయుడు కొండా లక్ష్మణ్‌బాపూజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమర యోధులు కొండా లక్ష్మణ్‌బాపూజీ 8వ వర్దంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో జన్మించి రాజకీయంగా, సామాజికంగా ఎత్తుపల్లాలను చవిచూసిన బాపూజీ ఉద్యమాలే ఽఊపిరిగా తన జీవితాన్ని సమాజానికి అంకితం చేశారని కొనియాడారు. ఆయన విలక్షణ జీవితశైలి ప్రతి ఒక్కరికీ అనుసరణీయమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బాపూజీ ఆశయాల సాధన కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతుందని చెప్పారు. 

Updated Date - 2020-09-21T19:44:17+05:30 IST