పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం- అల్లోల

ABN , First Publish Date - 2020-07-12T23:20:14+05:30 IST

ఇంటిని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మంచి ఆరోగ్యంగా ఉండవచ్చని, ఏ అనారోగ్యాలు దరికి చేరవని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం- అల్లోల

నిర్మల్‌: ఇంటిని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా  ఉంచుకుంటే మంచి ఆరోగ్యంగా ఉండవచ్చని, ఏ అనారోగ్యాలు దరికి చేరవని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ప్రతి ఆదివారం ఉదయం 10గంటలకు 10 నిమిషాలు కేటాయించుకుని ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఆదివారం 10గంటలకు 10నిమిషాలు కార్యక్రమంలో భాగంగా ఆదివారం తన ఇంటి గార్డెన్‌లో మొక్కల మధ్య గడ్డి పెరగకుండా కలుపుతీసి నీటి గుంతలు తవ్వారు. పరిసరాలను శుభ్రం చేసి నీళ్లుపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చికున్‌గున్యా వంటి సీజనల్‌ వ్యాధులకు మూల కారణం దోమలని అన్నారు. వాటిన నివారణకు ప్రతి ఆదివారం కొంత సమయాన్ని కేటాయించాలన్నారు. పరిసరాలుపరిశుభ్రంగా ఉండేలాచూసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ నల్లా వెంకట్‌రాంరెడ్డి, మున్సిపల్‌ఛైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-12T23:20:14+05:30 IST