రేవంత్ ఆ సవాల్‌కు కట్టుబడి ఉండాలి: మంత్రి అజయ్

ABN , First Publish Date - 2022-04-26T22:19:44+05:30 IST

కోడంగల్‌లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న.. సవాల్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కట్టుబడి..

రేవంత్ ఆ సవాల్‌కు కట్టుబడి ఉండాలి:  మంత్రి అజయ్

ఖమ్మం: కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న.. సవాల్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కట్టుబడి ఉండాలని మంత్రి  పువ్వాడ అజయ్ అన్నారు. మంగళవారం టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో అజయ్ మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ నాయకులకు కళ్లు మూసిన తెరచినా నేనే కనపడుతున్నా. నీతికి నీజాయితీకి కట్టుబడ్డ కుటుంబం పువ్వాడ కుటుంబం. పేదల ఆస్పత్రిగా వేలమంది డాక్టర్లను మమత మెడికల్ కళాశాల తీర్చిదిద్దింది. మంత్రి కేటీఆర్‌ని చూసి నేనే కాదు అరవై లక్షల మంది కార్యకర్తలు లేచి లేచి పడుతున్నారు.. కేటీఆర్ కేసీఆర్‌లను చూసి ఉప్పొంగిపోతాం. రేణుకా‌చౌదరి చరిత్ర ఏంటో ఖమ్మం ప్రజలకు తెలుసు.రేణుకాలా నేను మాట్లాడగలను...నాకు సంస్కారం అడ్డు వస్తుంది. ఖమ్మం జిల్లా ప్రజలు అమాయకులు కాదు.... కాంగ్రెస్ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. ఒకొక్కడు కాదు షేర్ ఖాన్.. వందల మంది రండి చూసుకుందామంటూ మంత్రి అజయ్ సినిమా డైలాగ్ చెప్పారు. ఖమ్మంలో కాంగ్రెస్ బీజేపీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నాయి’’ అని మంత్రి  పువ్వాడ అజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-04-26T22:19:44+05:30 IST