రాహుల్ గాంధీకి వినమ్రంగా సూచన చేసిన కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2021-06-22T01:42:19+05:30 IST

తరచూ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రంపై విమర్శలు గుప్పించే రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్

రాహుల్ గాంధీకి వినమ్రంగా సూచన చేసిన కేంద్ర మంత్రి

పాట్నా : తరచూ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రంపై విమర్శలు గుప్పించే రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఘాటుగా విమర్శించారు. అసలు రాహుల్ గాంధీ వ్యాక్సిన్ తీసుకున్నారో? లేదో? అన్న విషయం ప్రజలకు తెలియదని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం పాట్నాలో పర్యటించారు. వ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఒకవేళ రాహుల్ గాంధీ వ్యాక్సిన్ తీసుకోకుంటే.. వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని వినమ్రంగా కోరారు. ‘‘కాంగ్రెస్ ఎంపీ రాహుల్ ఇప్పటి వరకూ వ్యాక్సిన్ తీసుకున్నారో? లేదో? ప్రజలకు తెలియదు. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకోకపోతే... వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని వినమ్రంగా కోరుతున్నాను. దయచేసి వ్యాక్సిన్ తీసుకోండి’’ అని రవిశంకర్ ప్రసాద్ సూచించారు. 


Updated Date - 2021-06-22T01:42:19+05:30 IST