విద్యా సంవత్సరం ప్రారంభం కాకుండానే క్లాసులు ఎలా?: మంత్రి

ABN , First Publish Date - 2020-07-14T02:41:12+05:30 IST

రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్ల ఆన్‌లైన్ క్లాస్‌లు, ఫీజుల వసూళ్ల అంశంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్రంగా స్పందించారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకుండానే స్కూల్

విద్యా సంవత్సరం ప్రారంభం కాకుండానే క్లాసులు ఎలా?: మంత్రి

అమరావతి: రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్ల ఆన్‌లైన్ క్లాస్‌లు, ఫీజుల వసూళ్ల అంశంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్రంగా స్పందించారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకుండానే స్కూల్ యాజమాన్యాలు క్లాసులు ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా క్లాస్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆన్‌లైన్ క్లాసులపై ఇప్పటికీ ఎలాంటి పాలసీ నిర్ణయం తీసుకోలేదని మంత్రి వెల్లడించారు. ఆన్‌లైన్ క్లాసులు పెట్టాలంటే డిజిటల్ ఫ్లాట్‌ ఫామ్ ఉండాలన్నారు. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండే అవకాశం లేదన్నారు. కొన్ని చోట్ల ఆన్‌లైన్ క్లాసులకు స్కూల్ డ్రెస్‌లో కూర్చోవాలనే ఆదేశాలు జారీ చేసినట్లు తమ దృష్టికి వచ్చింది, అలాంటి వారిపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకుండా ఫీజులు కట్టమని ఎలా అడుగుతారని స్కూళ్ల యాజమాన్యాల తీరుపై మంత్రి సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-07-14T02:41:12+05:30 IST