-
-
Home » Andhra Pradesh » minister adimulapu suresh sawal to tdp leaders prakasam andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
టీడీపీ నేతలకు మంత్రి సురేష్ సవాల్
ABN , First Publish Date - 2022-05-07T17:48:44+05:30 IST
తెలుగుదేశం పార్టీ నిజస్వరూపం ఇవాళ బయట పడిందని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
ప్రకాశం: తెలుగుదేశం పార్టీ నిజస్వరూపం ఇవాళ బయట పడిందని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ నేతలకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పధకాలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎన్నోసార్లు చర్చకు రావాలని పిలిచినా టీడీపీ నేతల నుండి స్పందన లేదన్నారు. చంద్రబాబు తాజాగా కొత్త పొత్తులకు తెరలేపటం ఆయన ముసుగు తొలిగిందని అన్నారు. అందరం కలిసి మూకుమ్మడిగా పోటీ చేస్తే వైసీపీ మీద గెలవలేమని ఒప్పుకున్నట్లైందని తెలిపారు. సీఎం జగన్ అమలు చేసిన నవరత్నాలతోనే వైసీపీ ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్తుందని చెప్పారు. టీడీపీ దివాళా కోరుతనం మరోసారి ప్రజలకు తెలిసిందన్నారు. గతంలో వైసీపీ గెలిచిన సీట్ల కన్నా ఎక్కువ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 95 శాతం మ్యానిఫెస్టో అమలు చేశామని.. అదే తమకు శ్రీరామ రక్ష అని అన్నారు. టీడీపీ ఎన్ని మహానాడులు పెట్టుకున్నా.. నాడు.. నేడు.. రేపు ప్రజలు వైసీపీ వెంటే ఉంటారని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.