చంద్రబాబు ఎన్ని తపస్సులు చేసినా సీఎం కాలేరు: మంత్రి Suresh

ABN , First Publish Date - 2022-05-04T18:08:29+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్ని పాదయాత్రలు, బస్ యాత్రలు, సైకిల్ యాత్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.

చంద్రబాబు ఎన్ని తపస్సులు చేసినా సీఎం కాలేరు: మంత్రి Suresh

గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్ని పాదయాత్రలు, బస్ యాత్రలు, సైకిల్ యాత్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ మీద పూర్తి నమ్మకంతో ప్రజలు ఉన్నారని తెలిపారు. రానున్న 30 ఏళ్ళు వైసీపీయే అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు ఎన్ని తపస్సులు చేసిన సీఎం కాలేరని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. 


Read more