మంచి మిత్రుడిని కోల్పోయాం: మంత్రి Suresh

ABN , First Publish Date - 2022-02-21T16:10:45+05:30 IST

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మంచి మిత్రుడిని కోల్పోయాం: మంత్రి Suresh

అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంచి మిత్రుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా చిన్న వయసులో ఆయన మరణం చాలా బాధాకరమన్నారు. నిన్నటి వరకు అందరితో కలిసి మెలిసి ఉన్న మేకపాటి గౌతంరెడ్డి ఇక లేరు అనే వార్త కలచి వేసిందన్నారు. మేకపాటి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గౌతమ్ రెడ్డి మరణం పార్టీకి ప్రజలకు తీరని లోటన్నారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు. 

Updated Date - 2022-02-21T16:10:45+05:30 IST