ఉక్రెయిన్లో ఏపీ విద్యార్థులు సురక్షితం: మంత్రి ఆదిమూలపు
ABN , First Publish Date - 2022-02-25T21:21:05+05:30 IST
ఉక్రెయిన్లో ఉన్న ఏపీ విద్యార్థులు అందరూ క్షేమంగా ఉన్నారని మంత్రి
గుంటూరు: ఉక్రెయిన్లో ఉన్న ఏపీ విద్యార్థులు అందరూ క్షేమంగా ఉన్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది. దీనిలో పాల్గొన్న మంత్రి ఆదిమూలపు మాట్లాడారు. ఉక్రెయిన్లో ఉన్న విద్యార్థులను సురక్షితంగా తీసుకురావడానికి అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. ఫ్లైట్ లు అందుబాటులో లేకపోవడంతో కొంత ఆలస్యం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సుమారు 4000 మంది విద్యార్ధులు ఉక్రెయిన్లో ఉన్నట్లు సమాచారం ఉందని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ సినిమాకి ఆటంకాలు సృష్టిస్తున్నారని అనడం సరికాదన్నారు. తాగి మైకులు ముందుకు వచ్చి వాగే వారి మాటలను పట్టించుకోబోమని ఆయన అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శేషగిరిరావు, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదనరాజు, తదితరులు పాల్గొన్నారు.