విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సురేష్ సమీక్ష
ABN , First Publish Date - 2022-01-04T19:47:51+05:30 IST
విద్యాశాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
అమరావతి: విద్యాశాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో జగనన్న విద్యాకానుకపై మంత్రి సురేష్ సమీక్ష జరిపారు. పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, కమిషనర్ సురేష్ కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ వెట్రిసెల్వి సమావేశానికి హాజరయ్యారు.