ఆటోను ఢీకొన్న మినీ లారీ
ABN , First Publish Date - 2021-05-17T06:24:38+05:30 IST
రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్త తీవ్రంగా గాయప డిన సంఘ టన ఇది.
భార్య మృతి.. భర్తకు గాయాలు
ఉంగుటూరు, మే 16: రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్త తీవ్రంగా గాయప డిన సంఘ టన ఇది. ఉంగుటూరు మం డలం కైకరం గ్రామా నికి చెందిన సిరికి చంద్రరావు, సోవమ్మ భార్యాభర్తలు. కొద్ది రోజుల క్రితం సోవమ్మ కాలికి దెబ్బ తగలడంతో తాడేపల్లి గూడెం లోని కుమార్తె ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటోంది. ఆరోగ్యం కుదుట పడడంతో ఆదివారం ఉదయం ఆటో మాట్లాడుకుని తాడేపల్లి గూడెం నుంచి కైకరం వస్తుండగా నాచుగుంట వద్ద ఆటోను ఆపి డ్రైవర్ కిందికి దిగాడు. ఆ సమయంలో వెనుక నుంచి వస్తున్న మినీ లారీ ఆటోను ఢీకొనడంతో సోవమ్మ(65), చంద్రరావు తీవ్రంగా గాయపడగా హైవే అంబులెన్స్లో వీరిని చికిత్స నిమిత్తం తణుకు తీసుకు వెళుతుండగా సోవమ్మ మృతి చెందింది. దీనిపై చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. సోవమ్మ మృత దేహానికి తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్టు వివరించారు. చంద్రరావుకు ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. కుమారుడు రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.