అదే జరిగితే.. రెండు గంటల్లో దారుస్సలాం కూల్చేస్తాం: బండి సంజయ్

ABN , First Publish Date - 2020-11-25T20:06:15+05:30 IST

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నగరంలో అమీర్ పేట్ కార్పొరేటర్ అభ్యర్థి ప్రచార సభలో బుధవారం పాల్గొన్నఆయన..

అదే జరిగితే.. రెండు గంటల్లో దారుస్సలాం కూల్చేస్తాం: బండి సంజయ్

హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నగరంలో అమీర్ పేట్ కార్పొరేటర్ అభ్యర్థి ప్రచార సభలో బుధవారం పాల్గొన్నఆయన.. పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చాలన్న అక్బర్ వ్యాఖ్యలను ఖండించారు. ‘హుస్సేన్ సాగర్‌పై ఉన్న పీవీ సమాధిని, ఎన్టీఆర్ సమాధిని కూల్చే దమ్ము నీకుందా? నీ అయ్య జాగీరా, నీ తాత జాగీరా భాయ్. పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చిన రెండుగంటల్లో నీ దారుస్సలాంను బీజేపీ కార్యకర్తలు కూల్చేస్తారు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మభ్యపెట్టి, ఏమార్చి ఓట్లు పొందాలని టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు చూస్తున్నారన్నారు. చేవచచ్చి టీఆర్ఎస్ నాయకులు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎంఐఎం నాయకులు చేసే సవాల్‌ను స్వీకరించలేని దౌర్భాగ్య పరిస్థితిలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారన్నారు. ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. హిందువులు అందరూ ఓటు బ్యాంకుగా మారితేనే హైదరాబాద్‌లో బీజేపీ గెలుస్తుందన్నారు.   

Updated Date - 2020-11-25T20:06:15+05:30 IST