మిల్లర్ల జేబులు నింపేందుకే కోతలు
ABN , First Publish Date - 2020-05-20T09:39:56+05:30 IST
కొనుగోలు కేంద్రాల ద్వారా ఎక్కువ తూకం వేస్తూ మళ్లీ మిల్లుల్లో దిగుమతి అయ్యాక కోత విధిస్తూ మిల్లర్ల జేబులు నింపడానికే ప్రభుత్వం పని
కాంగ్రెస్ కిసాన్సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్రెడ్డి
వర్ధన్నపేట, మే 19 : కొనుగోలు కేంద్రాల ద్వారా ఎక్కువ తూకం వేస్తూ మళ్లీ మిల్లుల్లో దిగుమతి అయ్యాక కోత విధిస్తూ మిల్లర్ల జేబులు నింపడానికే ప్రభుత్వం పని చేస్తోందని కాంగ్రెస్ కిసాన్సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఇల్లందలో వర్ధన్నపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నాయకులు ఎర్రబెల్లి వరదరాజేశ్వర్రావు, నమిండ్ల శ్రీనివాస్, బొంపెల్లి దేవేందర్రావు, వెంకట్రామిరెడ్డిలో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అన్వేష్రెడ్డి మాట్లాడుతూ తాలు పేరుతో 2 కిలోల వరకు అదనంగా తూకం వేసుకోవడంతోపాటు మిల్లుకు చేరగానే మళ్లీ కిలోకుపైగా 40కిలోల బస్తాకు కోత విధిస్తున్నా ప్రజా ప్రతినిధులు, అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు నరుకుడు వెంకటయ్య, ఎర్ర శ్రవణ్కుమార్, పోశాల వెంకన్న, గుంటి కుమారస్వామి, మల్లెపాక సమ్మయ్య తదితరులు ఉన్నారు.