సచివాలయాల్లో పాలు కొనుగోలు కేంద్రాలు

ABN , First Publish Date - 2020-11-25T05:01:01+05:30 IST

సచివాలయాల్లో పాలు కొనుగోలు కేంద్రాల ఏ ర్పాటుకు చర్యలు తీసు కుంటున్నట్లు రాష్ట్ర మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు తెలిపారు. మంగళవారం పాత టెక్కలిలో పశుసంవర్ధక ఏడీ రవికృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పశువైద్య శిబిరం ప్రారంభించారు.

సచివాలయాల్లో పాలు కొనుగోలు కేంద్రాలు
మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు

మంత్రి సీదిరి అప్పలరాజు

వజ్రపుకొత్తూరు :  సచివాలయాల్లో పాలు కొనుగోలు కేంద్రాల ఏ ర్పాటుకు చర్యలు తీసు కుంటున్నట్లు  రాష్ట్ర మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు తెలిపారు. మంగళవారం పాత టెక్కలిలో  పశుసంవర్ధక ఏడీ రవికృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  పశువైద్య శిబిరం  ప్రారంభించారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ వైఎస్సార్‌ చేయూత పఽథకం కింద రాష్ట్రంలో 3.5 లక్షల మంది మహిళలు మేలు జాతిపశువులను కావాల ని దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. ఫిబ్రవరిలో లక్ష పశువులను ప్రభుత్వం పాడి రైతులకు అందించే ఏర్పాట్లు చేస్తోందన్నారు. ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలలో అమూల్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జేడీ ఎ.ఈశ్వరరావు, డీడీ ఎం. జగన్నాథరావు పాల్గొన్నారు. తొలుత పల్లిసారధిలో సచివాల భవనం నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు యు.ఉదయకుమార్‌, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు నీలవేణి పాల్గొన్నారు. 

 

Updated Date - 2020-11-25T05:01:01+05:30 IST