ఇక పాలపై బాదుడు

ABN , First Publish Date - 2022-04-14T07:19:11+05:30 IST

సామాన్యులపై ధరల భారం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే

ఇక పాలపై బాదుడు

  • విజయ పాలు లీటరుకు రూ.2 పెంపు
  • రేపటి నుంచి కొత్త ధరలు 
  • 4 నెలల్లో రెండో సారి పెంపు


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): సామాన్యులపై ధరల భారం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, వంటనూనెలు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై ఇప్పుడు మరో భారం పడనుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విజయ డెయిరీ పాల ధరలను పెంచుతూ నిర్ణయం  తీసుకుంది. లీటరుకు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది.


లీటరు టోన్డ్‌ మిల్క్‌ ధర ప్రస్తుతం రూ.49 ఉండగా దాన్ని రూ.51 చేశారు. 500 మి.లీ డబుల్‌ టోన్డ్‌ మిల్క్‌ ధర రూ.23 నుంచి 24కి; టీ స్పెషల్‌ రూ.24 నుంచి 25కి; టోన్డ్‌ మిల్క్‌, ఆవు పాలు రూ.25 నుంచి 26కి, హోల్‌ మిల్క్‌ రూ.33 నుంచి 34కి పెంచారు. పెంచిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. విజయ డెయిరీ గడిచిన నాలుగు నెలల్లో పాల ధరలను పెంచడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరి 1న లీటరుకు రూ.2-4 పెంచిన విషయం తెలిసిందే.


Updated Date - 2022-04-14T07:19:11+05:30 IST