చైనా దూకుడుపై భారతీయులు బాగా స్పందించారు: పాంపియో
ABN , First Publish Date - 2020-07-09T14:07:32+05:30 IST
చైనా దూకుడు చర్యల పట్ల భారతీయులు చాలా బాగా స్పందించారని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు.
వాషింగ్టన్, జూలై 8: చైనా దూకుడు చర్యల పట్ల భారతీయులు చాలా బాగా స్పందించారని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. చైనా దూకుడు చర్యలకు సంబంధించి అనేకసార్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్తో మాట్లాడానని తెలిపారు. కాగా, తూర్పు లద్దాఖ్లోని హాట్ స్ర్పింగ్స్ నుంచి చైనా తన బలగాలను వెనక్కి తీసుకునే ప్రక్రియను దాదాపు పూర్తి చేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.