నా ఐపీఎల్ జట్టుకు ధోనీనే కెప్టెన్: మైకేల్ హస్సీ
ABN , First Publish Date - 2020-07-05T04:13:51+05:30 IST
తన ఐపీఎల్ జట్టుకు ధోనీయే కెప్టెన్ అని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైకేల్ హస్సీ వెల్లడించాడు.
కాన్బెర్రా: తన ఐపీఎల్ జట్టుకు ధోనీయే కెప్టెన్ అని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైకేల్ హస్సీ వెల్లడించాడు. మొత్తం 11మందితో తన ఫేవరెట్ జట్టును అతను ప్రకటించాడు. రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్లను ఓపెనర్లుగా ఎంచుకున్న హస్సీ.. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ను మూడు, నాలుగు స్థానాలకు ఎంపిక చేశాడు. ఆ తర్వాతి స్థానాల్లో హార్దిక్ పాండ్యా, ఆండ్రీ రస్సెల్ను సెలెక్ట్ చేశాడు. ఇక బౌలర్ల విషయానికొస్తే అప్ఘాన్ బౌలర్ రషీద్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా పేర్లను జట్టులో చేర్చాడు.