శ్రామిక రైల్లో మహిళ ప్రసవం
ABN , First Publish Date - 2020-05-19T23:33:05+05:30 IST
వలస కార్మికులను తరలించేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక రైల్లో ఓ మహిళ...
పాట్నా: వలస కార్మికులను తరలించేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక రైల్లో ఓ మహిళ ప్రసవించింది. త్రిపురలోని జిరానియా జిల్లా నుంచి బీహార్లోని ఖగారియా జిల్లాకు బయలుదేరిన రైల్లో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై వైద్యులు, అధికారులు స్పందిస్తూ, రైల్లో ప్రయాణిస్తున్న గర్భవతికి ఉన్నట్లుండి నెప్పులు వచ్చాయని, రైలు బీహార్లోని కతీహార్ జిల్లాకు చేరుకోగానే వైద్యులు హుటాహుటినా ఆమెకు వైద్యం అందించి ప్రసవం చేశారని తెలిపారు. తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, రైల్లో ప్రయాణించేందుకు వారి ఆరోగ్యం సహకరిస్తుందని వైద్యులు వెల్లడించారు. ఈ విషయాన్ని ఈశాన్య రైల్వే కూడా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.