మధ్యాహ్న భోజనం తనిఖీ
ABN , First Publish Date - 2021-12-01T05:03:03+05:30 IST
కోడుమూరులోని ప్రభుత్వ బాలుర, బాలిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మధ్యాహన్న భోజనాన్ని రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ సభ్యురాలు గుడిసె కృష్ణమ్మ మంగళవారం తనిఖీ చేశారు.
కోడుమూరు, నవంబరు 30: కోడుమూరులోని ప్రభుత్వ బాలుర, బాలిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మధ్యాహన్న భోజనాన్ని రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ సభ్యురాలు గుడిసె కృష్ణమ్మ మంగళవారం తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. వంటశాల గదిని ఆమె సందర్శించి శుభ్రత, భోజనం తయారు విధానాన్ని పరిశీలించారు. హెచ్ఎం శ్రీనివాసయాదవ్, నాగరాజకుమారి ఉన్నారు.