భోజన కార్మికురాలిని విధుల్లోకి తీసుకోవాలని ధర్నా

ABN , First Publish Date - 2021-10-26T03:58:51+05:30 IST

విధుల నుంచి అక్రమంగా తొలగించిన మధ్యాహ్నభోజన కార్మికురాలు వెంకటరమణమ్మను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కార్మికులు, సీఐటీయూ నాయకులు ఆర్డీవో కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు.

భోజన కార్మికురాలిని విధుల్లోకి తీసుకోవాలని ధర్నా
ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు, సీఐటీయూ నాయకులు

నాయుడుపేట టౌన్‌, అక్టోబరు 25 : విధుల నుంచి అక్రమంగా తొలగించిన మధ్యాహ్నభోజన కార్మికురాలు వెంకటరమణమ్మను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కార్మికులు, సీఐటీయూ నాయకులు ఆర్డీవో కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా మఽధ్యాహ్నభోజన కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు విజయమ్మ మాట్లాడుతూ ఓజిలి కాలనీ పాఠశాలలో మధ్యాహ్నభోజన కార్మికురాలుగా పనిచేస్తున్న వెంకటరమణమ్మను ఎలాంటి కారణాలు లేకుండా అక్రమంగా తొలగించారన్నారు. వెంకటరమణమ్మను విధుల్లోకి తీసుకోవడంతోపాటు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్‌కె రహనాబేగం, సభ్యులు విమలమ్మ, సుమతి, జయమ్మ, రమణమ్మ, సుగుణమ్మ, సీఐటీయూ నాయకులు ముకుంద, సీహెచ్‌. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.





Updated Date - 2021-10-26T03:58:51+05:30 IST