ఎంఐ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు
ABN , First Publish Date - 2021-03-02T22:22:53+05:30 IST
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమి..
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. భారత మార్కెట్లో ఎంఐ 10టీ స్మార్ట్ఫోన్లపై రూ. 3000 వరకు తగ్గించినట్లు షియోమి సంస్థ పేర్కొంది.
6జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్ వేరియంట్ ఎంఐ 10టీ స్మార్ట్ఫోన్లను గత సంవత్సరం అక్టోబర్ నెలలో విడుదల చేసినట్లు షియోమి ప్రకటించింది. భారత మార్కెట్లో ఎంఐ 10టీ స్మార్ట్ఫోన్స్ విడుదల చేసినప్పడు ఫోన్ ధర రూ. 35,999 ఉండగా.. ప్రస్తుతం 32,999కే లభిస్తోందని కంపెనీ పేర్కొంది.