ABN effect.. వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ సీరియస్..
ABN , First Publish Date - 2022-09-08T17:17:54+05:30 IST
ఎంజీఎం ఆస్పత్రిలో వార్డుల్లో ఎలుకల సంచారంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రసారం చేసింది.
వరంగల్ (Warangal): ఎంజీఎం (MGM) ఆస్పత్రిలో వార్డుల్లో ఎలుకల (Rats) సంచారంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)లో కథనాలు ప్రసారం చేసింది. దీనిపై ఎంజీఎం సూపరింటెండెంట్ (Superintendent)స్పందిస్తూ.. వార్డుల్లో ఎలుకల సంచారంపై సీరియస్ అయ్యారు. శానిటేషన్ కాంట్రాక్టర్, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఎలుకల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో శానిటేషన్ సిబ్బంది వెంటనే ఎలుకల నివారణకు బోన్లు, మీటలు, ర్యాట్ కిల్స్ ఏర్పాటు చేశారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోగిపై ఎలుకలు దాడి చేసిన ఘటన గురించి అందరికీ తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరోసారి ఎలుకల బెడద రోగుల్ని వణికిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి అయిన ఎంజీఎంలోని ఆర్ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న హనుమకొండ జిల్లా భీమారం ప్రాంతానికి చెందిన కడార్ల శ్రీనివాస్ అనే రోగి చేతి వేళ్లు, కాలివేళ్లు, ఇతర శరీర భాగాలను ఎలుకలు కొరికివేశాయి. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం అప్పటి సూపరింటెండెంట్ డా.బి.శ్రీనివాసరావును తప్పించింది. కొత్త సూపరింటెండెంట్ వచ్చినా..ఎలుకల భయం బెడదలో మాత్రం మార్పు రాలేదు. ఈ సంఘటన తాలూకు దృశ్యాలు మన కళ్ల ముందే కదులుతున్న తరుణంలోనే మరోసారి ఎంజీఎంలో ఎలుకల స్వైరవిహారం బయటపడింది.
తాజాగా..ఎంజీఎంలోని ఆస్పత్రిలో జనరల్ వార్డుల్లో ఎలుకల సంచారం కలకలం రేపుతోంది. పేషెంట్స్, సిబ్బందికి మూషికాలతో ముప్పుతిప్పలు పెడుతున్నాయి. శానిటేషన్ సిబ్బంది నిర్లక్ష్యంతో ఇన్ పేషెంట్స్ వార్డుల్లో సంచరిస్తున్నాయి. శానిటేషన్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఎలుకలు తిరుగుతుండటంతో రోగుల బంధువులు మండిపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ శానిటేషన్ సిబ్బందిపై మండిపడ్డారు. ఎలుకల బెడద నుంచి శాశ్వత పరిష్కారం కోసం సిబ్బందిని సూపరింటెండెంట్ రంగంలోకి దింపింది అయినా.. నామమాత్రంగానే పనులు చేయడంతో మళ్లీ ఎలుకల సంచారం మొదలైంది. గతంలో ఓ రోగిని కొరికి చంపిన ఎలుకలు ఇప్పుడు మరోసారి బయటకు రావడంతో రోగులు వారి బంధువులు భయాందోళనకు గురవుతున్నారు.