ఆర్డీటీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి : మేయర్
ABN , First Publish Date - 2022-05-19T03:18:34+05:30 IST
నెల్లూరు రూరల్లోని 24వ డివిజన్ ఆర్డీటీ కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పనకు తనవంతు కృషి చేస్తానని మేయర్ పొట్లూరి స్రవంతి అన్నారు.
నెల్లూరురూరల్, మే 18 : నెల్లూరు రూరల్లోని 24వ డివిజన్ ఆర్డీటీ కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పనకు తనవంతు కృషి చేస్తానని మేయర్ పొట్లూరి స్రవంతి అన్నారు. బుధవారం స్థానిక కాలనీలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్రెడ్డితో కలిసి కాలనీ వాసులతో మాట్లాడారు. తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు, రోడ్లును ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా పనులను నిర్వహిస్తామని చెప్పారు. ఈ ప్రాంత చిన్నారుల కోసం అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అరవ శాంతి, వైసీపీ ఇన్చార్జి శ్రీనివాసులు, నాయకులు అజయ్, ఉదయ్కుమార్ పాల్గొన్నారు.