టీఎస్‌ఆర్డీసీ చైర్మన్‌గా మెట్టు బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2022-04-04T10:03:21+05:30 IST

తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్థి సంస్థ కార్పొరేషన్‌ (టీఎ్‌సఆర్డీసీ) చైర్మన్‌గా మెట్టు శ్రీనివాస్‌ ఎర్రమంజిల్‌లోని ..

టీఎస్‌ఆర్డీసీ చైర్మన్‌గా మెట్టు బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్థి సంస్థ కార్పొరేషన్‌ (టీఎ్‌సఆర్డీసీ) చైర్మన్‌గా మెట్టు శ్రీనివాస్‌ ఎర్రమంజిల్‌లోని రోడ్లు, భవనాల శాఖ కార్యాలయంలోని తన చాంబర్‌ లో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీలు గణపతి రెడ్డి, రవీందర్‌ రావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు వేముల, ఎర్రబెల్లి, సత్యవతి మాట్లాడుతూ రాజకీయాల్లో ఓపిక అవసరమని, కష్టపడి పనిచేసే వారిని సీఎం కేసీఆర్‌ గుర్తిస్తారని, అలాంటి వారికి సమయానుకూలంగా పదవులు వరిస్తాయని అన్నారు.  తెలంగాణ పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ సోమవారం నుంచి టీఆర్‌ఎస్‌ నిర్వహించే ఆందోళనల్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.

Updated Date - 2022-04-04T10:03:21+05:30 IST