‘మెట్రో రైల్వేస్టేషన్‌కు పునీత్‌ రాజ్‌కుమార్‌ పేరు పెట్టాలి’

ABN , First Publish Date - 2021-12-20T17:53:57+05:30 IST

పులకేశినగర్‌ శాసనసభా నియోజకవర్గంలోని పాటరీరోడ్డు-ప్రభుత్వ ఫెదర్‌లైట్‌ పాఠశాల సమీపంలో సిద్ధమవుతున్న ప్యాటరీ టౌన్‌ మెట్రో రైల్వేస్టేషన్‌కు హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌ పేరు పెట్టాలని కర్ణాటక బహుజన

‘మెట్రో రైల్వేస్టేషన్‌కు పునీత్‌ రాజ్‌కుమార్‌ పేరు పెట్టాలి’

బెంగళూరు: పులకేశినగర్‌ శాసనసభా నియోజకవర్గంలోని పాటరీరోడ్డు-ప్రభుత్వ ఫెదర్‌లైట్‌ పాఠశాల సమీపంలో సిద్ధమవుతున్న ప్యాటరీ టౌన్‌ మెట్రో రైల్వేస్టేషన్‌కు హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌ పేరు పెట్టాలని కర్ణాటక బహుజన ఫెడరేషన్‌ విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు ప్రత్యేక లేఖలను పులకేశినగర్‌ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి, బీబీఎంపీ ప్రత్యేక కమీషనర్‌ గౌరవ్‌ గుప్తాకు శనివారం అందజేసింది. ఈ సందర్భంగా ఫెడరేషన్‌ సంస్ధాపక అధ్యక్షుడు జీహెచ్‌. శంకర్‌ మీడియాతో మాట్లాడుతూ అనాథ, నిరుపేద విద్యార్ధులకు కొండంత అండగా నిలబడి దేశవ్యాప్తంగా ప్రజల్లో స్ఫూర్తినింపిన పునీత్‌ పేరిట ఏటా సేవా కార్యక్రమం చేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. పునీత్‌ చేసిన సమాజసేవా కార్యక్రమాలను ఎంతగా ప్రశంసించినా తక్కువేనన్నారు. తమ విజ్ఞప్తిపై బీబీఎంపి, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఈ అంశంపై బీబీఎంపి అధికారులతో తాను మాట్లాడతానని ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి భరోసా ఇచ్చారని శంకర్‌ తెలిపారు.

Updated Date - 2021-12-20T17:53:57+05:30 IST