ఓటమి పాలైన ‘మెట్రో శ్రీధరన్’
ABN , First Publish Date - 2021-05-02T22:20:01+05:30 IST
పాలక్కడ్ నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి మెట్రో శ్రీధరన్ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి షఫీ పరంబిల్ చేతిలో
తిరువనంతపురం : పాలక్కడ్ నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి మెట్రో శ్రీధరన్ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి షఫీ పరంబిల్ చేతిలో 7,403 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. శ్రీధరన్ మెట్రో మ్యాన్గా గుర్తింపు పొందారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ సమక్షంలో ఫిబ్రవరిలో శ్రీధరన్ బీజేపీలో చేరారు. తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థి శ్రీధరన్ అని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది.