దూసుకుపోతున్న ‘మెట్రో’...

ABN , First Publish Date - 2022-01-17T21:37:34+05:30 IST

త్రైమాసిక ఫలితాల నేపధ్యంలో... పాదరక్షల కంపెనీ ‘మెట్రో’ దూసుకుపోతోంది.

దూసుకుపోతున్న ‘మెట్రో’...

హైదరాబాద్ : త్రైమాసిక ఫలితాల నేపధ్యంలో... పాదరక్షల కంపెనీ ‘మెట్రో’ దూసుకుపోతోంది. నిరుడు డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బలమైన ఆదాయాలను నమోదు చేసిన తర్వాత, ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్‌ఝన్‌వాలా-మద్దతున్న మెట్రో బ్రాండ్‌ల షేర్లు ఈ రోజు(సోమవారం) ఇంట్రా-డేలో బీఎస్ఈలో 20 శాతం పెరిగి, రూ. 608.20 కు చేరుకున్నాయి. డిసెంబరు 22, 2021 న లిస్టైనప్పటి నుంచీ కూడా... ఈ స్టాక్ అత్యధిక స్థాయిలో ట్రేడవుతోంది.  నేటి పెరుగుదలతో ఒక్కో షేరు ఇష్యూ ధర రూ. 500 తో పోలిస్తే, 22 శాతం లాభపడింది. ఉదయం 10:05 గంటలకు.. మెట్రో బ్రాండ్స్ 18 శాతం పెరిగి, రూ. 600 వద్ద ట్రేడవుతోంది. మొన్నటి డిసెంబరు 21 నాటికి మెట్రో బ్రాండ్లలో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలాకు 14.42 శాతం వాటా ఉన్నట్లు షేర్‌హోల్డింగ్ ప్యాటర్న్ డేటా వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి మెట్రో బ్రాండ్స్... సంవత్సరానికి 53.2 శాతం(వార్షిక ప్రాతిపదికన)  వృద్ధిని నమోదు చేసి, ఏకీకృత నికర లాభం రూ. 102 కోట్ల రాబడి వృద్ధిని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా కంపెనీ మొత్తం ఆదాయం 59 శాతం పెరిగి రూ.484 కోట్లకు చేరుకుంది. 

Updated Date - 2022-01-17T21:37:34+05:30 IST